Bollywood: దివంగ‌త శ్రీ‌దేవి లెట‌ర్‌.. జాన్వీక‌పూర్ ఎమోష‌న‌ల్‌!

Bollywood: దివంగ‌త లెజండ‌రీ న‌టి శ్రీ‌దేవి అతిలోక సుంద‌రిగా తెలుగు ప్రేక్ష‌కుల్లో ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. ఆమె అందంతో పాటు త‌న న‌ట‌న‌.. వేశాధార‌ణ‌.. హావాభావాల‌తో సినీ ప్రేక్ష‌కుల‌ను ఎంతో మెప్పించింది. ఆమెకు ఇద్ద‌రు కుమార్తెలు జాన్వీక‌పూర్ పెద్ద కుమార్తె కాగా.. రెండో కుమార్తె ఖుషీక‌పూర్‌. ఇందులో జాన్వీక‌పూర్ సినీ ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన విష‌యం తెలిసిందే. అయితే జాన్వీను హీరోయిన్‌గా చూడాల‌ని శ్రీ‌దేవి ఎన్నో క‌ల‌లు క‌న్నార‌ట‌.. కూతురును Bollywoodహీరోయిన్‌గా చూడ‌కుండానే శ్రీ‌దేవి క‌న్నుమూశారు.. జాన్వీ క‌పూర్ తొలి సినిమా ప్రారంభోత్స‌వం నాడు శ్రీ‌దేవి ఉన్నారు. కాని ఆ సినిమా విడుద‌ల స‌మ‌యంలో శ్రీ‌దేవి ఈ లోకంలో లేకుండా వెళ్లి పోయారు.

Jhanvikapoor

కాగా తాజాగా శ్రీ‌దేవి వర్ధంతి సంద‌ర్భంగా Bollywoodజాన్వీ క‌పూర్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఎమోష‌న్ పోస్ట్ చేసింది. ఆ పోస్ట్‌లో త‌న‌కు గ‌తంలో త‌ల్లి శ్రీ‌దేవి స్వ‌యంగా రాసిన లేఖ‌ను తెలిపింది జాన్వీ. ఐ ల‌వ్ యూ మై ల‌బ్బు యు ఆర్ ది బెస్ట్ బేబీ ఇన్ ది వ‌ర‌ల్డ్ అంటూ శ్రీ‌దేవి రాసిన లేఖ‌ను జ‌త చేస్తూ, నీవు లేని ఈ ప్ర‌పంచంను ఇంకా జీర్ణించుకోలేక‌పోతున్నాం.. నీవు లేని లోటు ఫ్యామిలీ అంతా ఎంతో బాధ‌ప‌డుతుంది అంటూ ఎమోష‌నల్ ట్వీట్ చేసింది జాన్వీకపూర్‌. ఇక జాన్వీ క‌పూర్ ప్ర‌స్తుతం రూహి Bollywoodసినిమాలో న‌టిస్తోంది. ఇందులో బాలీవుడ్ ప్ర‌ముఖ న‌టుడు రాజ్ కుమార్ రావు న‌టిస్తున్నాడు. ఇందులో ప్ర‌త్యేక‌మైన పాత్ర‌లో కనిపించ‌నుంది జాన్వీ.