ప్రముఖ సినిమాటోగ్రపర్ సెంథిల్ భార్య మృతి

ప్రముఖ సినిమాటోగ్రపర్ సెంథిల్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన భార్య రూహి మృతి చెందడం జారింది. ఈ విష్యం విన్న చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతి చెందింది. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న రూహి చికిత్స పొందుతూ గురువారం మరణించారు. కాగా ఆమె అంత్య క్రియలు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో శుక్రవారం జరగనున్నాయి.
సెంథిల్ ప్రముఖ దర్శకుడు రాజమౌళితో కలిసి సై, ఛత్రపతి, మగధీర, యమదొంగ, ఈగ, బాహుబలి 1 & 2, ఆర్ ఆర్ ఆర్ సినిమాలకి సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన విష్యం అందరికి తెలిసిందే. 2009 లో సెంథిల్ రూహి ని వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. కొద్ది రోజులుగా రూహి అనారోగ్య కారణంగా సెంథిల్ సినిమాలకు బ్రేక్ ఇచ్చారు.
రుహీ వృత్తిరీత్యా యోగా శిక్షకురాలు. గతంలో స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టితో కలిసి పని చేసారు.