టాలీవుడ్‌లో మ‌రో విషాదం.. ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ రాఘ‌వేంద్ర‌రావు సోద‌రుడు క‌న్నుమూత‌!

Tollywood: టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో మ‌రో విషాదం నెల‌కొంది. ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ రాఘ‌వేంద్ర‌రావు సోద‌రుడు ఆర్‌కె. ఫిలిమ్స్ అధినేత కోవెల‌మూడి కృష్ణ‌మోహ‌న్ రావు మ‌ర‌ణించారు. గ‌త కొంత కాలంగా ఆయ‌న అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో భాద‌ప‌డుతున్న ఆయ‌న ఫిలింన‌గ‌ర్‌లోని త‌న నివాసంలో ఈ రోజు మ‌ధ్యాహ్నం క‌న్నుమూశారు.

Tollywood News

ఆయ‌న వ‌య‌స్సు 81 సంవ‌త్స‌రాలు కాగా.. ఈయ‌న‌కు ఇద్దరు కుమార్తెలు.. రేపు ఫిల్మ్‌న‌గ‌ర్‌లోని మ‌హాప్ర‌స్థానంలో అంత్య‌క్రియ‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఆయ‌న మృతితో డైరెక్ట‌ర్ రాఘ‌వేంద్ర‌రావు ఇంట విషాద చాయ‌లు అలుముకున్నాయి.. ఆయ‌న మృతికి ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సంతాపం ప్ర‌క‌టించారు.