లైంగిక దాడి కేసులో విచారణకు హాజరైన దర్శకుడు

బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై ఇటీవల లైంగిక ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అసభ్యకరంగా ప్రవర్తించి రేప్ చేయడానికి ప్రయత్నం చేశాడని హీరోయిన్ పాయల్ ఘోష్ ఒక న్యూస్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చింది. ఇక ఫైనల్ గా అనురాగ్ క‌శ్య‌ప్ .. ముంబైలో పోలీసు స్టేష‌న్ ముందు హాజ‌ర‌య్యారు. లైంగిక దాడికి సంబంధించి ఆరోప‌ణ‌ల తరువాత అనురాగ్ క‌శ్య‌ప్‌కు బుధ‌వారం స‌మ‌న్లు జారీ చేశారు.

ఇక తాజా ప‌రిస్థితుల నేప‌థ్యంలో త‌న‌కు వై కేటిగిరీ భ‌ద్ర‌త‌ను క‌ల్పించాల‌ని పాయల్ ఘోష్, మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ భ‌గ‌త్ సింగ్ కొష్యారీని క‌లిసి ఓ లేఖ అంద‌జేసింది. ఆరోప‌ణ‌ల‌పై అనురాగ్ మరోసారి స్పందించారు. కావాల‌నే పాయ‌ల్ త‌న‌పై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తుంద‌ని, త‌ను అలాంటి వాడిని కాద‌ని తెలియజేశాడు. దీంతో అనురాగ్ కి పలువురు బాలీవుడ్ సెలబ్రెటీలు మద్దతు పలికారు. అందులో దర్శకుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌ కూడా ఉన్నారు. ఇక పాయ‌ల్‌కు కూడా సినీ ప్ర‌ముఖులే కాక రాజ‌కీయ నాయ‌కులు కూడా మ‌ద్ద‌తు ఇస్తున్నారు.