డ్రగ్స్ కేసులో న్యూ ట్విస్ట్.. షారుక్ ఖాన్ ను కూడా విచారించనున్నారా?

బాలీవుడ్ డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. మొదట సుశాంత్ కేసుతో మొదలై అనేక రకాల కోణాల్లో ఊహించని వ్యక్తుల పేర్లు బయటకు వస్తున్నాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొన్న దీపికా పదుకొనె, శ్రద్దా కపూర్, సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ NCB విచారణకు హాజరైన విషయం తెలిసిందే.

ఇక వారి సెల్ ఫోన్స్ ని సీజ్ చేసిన అధికారులు ఇంకా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయనే కోణంలో విచారిస్తున్నారు. ఇక
ముంబైలోని ఒక ప్రముఖ మీడియా సంస్థ కథనం ప్రకారం ఈ కేసులో షారుఖ్ ఖాన్ మరియు అర్జున్ రాంపాల్ వంటి వారికి త్వరలో సమన్లు అందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరిని డ్రగ్స్ కేసులోనే విచారించనున్నట్లు రూమర్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ఇప్పటివరకు ఈ విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. మరి షారుక్ నుంచి ఎలాంటి వివరణ వస్తుందో చూడాలి. ఇటీవల షారుక్ ఐపీఎల్ లో తన జట్టు కేకేఆర్ కి మద్దతు ఇవ్వడానికి UAEకి వెళ్లిన విషయం తెలిసిందే.