ప్రభాస్ 21 అఫీషియల్: హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్

50ఏళ్ళ సినీ ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగించిన ప్రఖ్యాత వైజయంతి మూవీస్ నుంచి మరో బిగ్ సర్ ప్రైజ్ వచ్చింది. శ్రీదేవి, వాణీ శ్రీ, జయప్రద, సౌందర్య, ప్రీతి జింతా, ఐశ్వర్యారాయ్ వంటి ఎవర్ హీరోయిన్స్ తో గుర్తిండిపోయే సినిమాలు నిర్మించిన వైజయంతి మూవీస్ నేటితరం సమంత, కాజల్ అగర్వాల్, కీర్తి సురేష్ వంటి వారితో కూడా అద్భుతమైన సినిమాలు చేసింది.

ఇక ఇప్పుడు మొదటిసారి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనెతో కూడా వర్క్ చేయడానికి సిద్ధమైంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ఒక పాన్ ఇండియా సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ప్రఖ్యాత సినిమా నిర్మాణ సంస్థ వైజయంతి నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయంలో చిత్ర యూనిట్ ఫైనల్ గా ఒక క్లారిటీ ఇచ్చింది.

గత వారం నుంచి వైజయంతి మూవీస్ నుంచి ఒక బిగ్ సర్ ప్రైజ్ రానుందని అనేక రాకల వార్తలు వస్తున్నాయి. ఇక అనుకున్నట్లుగానే చిత్ర యూనిట్ అభిమానులకు మంచి సర్ ప్రైజ్ ఇచ్చింది. ప్రభాస్ తో చేస్తున్న సైన్స్ ఫిక్షన్ కథలో హీరోయిన్ గా దీపికా పదుకొనె ఖరారయ్యింది.

మహానటి వంటి సినిమాతో వైజయంతి మూవీస్ కి అద్భుతమైన విజయాన్ని అందించిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను ప్రభాస్ రేంజ్ కి ఏ మాత్రం తగ్గకుండా పాన్ ఇండియా లెవెల్లో సినిమాను తెరకెక్కించబోతున్నాడు. మరి ఈ సినిమా రిలీజ్ అనంతరం ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.