Tollywood: చిరంజీవి-మోహ‌న్‌బాబు తాజా ఫోటోను షేర్ చేసిన ల‌క్ష్మీ ప్ర‌స‌న్న‌..

Tollywood: మెగాస్టార్ చిరంజీవి, డైలాగ్ కింగ్ మోహ‌న్‌బాబు క‌లిసి తాజాగా సిక్కిం టూర్ కు వెళ్లారు. వీరిద్ద‌రికి సంబంధించిన ఫోటోను మంచు ల‌క్ష్మీ ప్ర‌స‌న్న సోషల్ మీడియా వేదిక‌గా పోస్ట్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి అంకుల్ వీకెండ్ ట్రిప్‌కు నాన్న‌ను ద‌గ్గ‌రుండి ఒప్పించి మ‌రీ తీసుకెళ్లాడ‌ని..త‌న‌కు వీరిపై కొంత ఈర్ష్య‌గా ఉంద‌ని తెలిపింది ల‌క్ష్మీ ప్ర‌స‌న్న‌.

legendarys

కానీ వీరిద్ద‌రు హాయిగా ట్రిప్‌కు వెళ్లినందుకు సంతోషిస్తున్నార‌ని చెప్పింది. నా హృద‌యం నిండిపోయింది. ఏదో ఒక‌రోజు పిల్ల‌లంద‌రం మీతో క‌లిసి వ‌స్తాం అంటూ ల‌క్ష్మీ ప్ర‌స‌న్న తెలిపింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.