డ్రగ్స్ కేసులో హీరో అరెస్ట్?

బాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు కలకలం రేపుతూనే ఉంది. ఇటీవల బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్‌కు ఎన్సీబీ అధికారులు నోటీసులు జారీ చేయడం సంచలనం రేపింది. తాజాగా ఈ కేసులో బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్‌ని ఎన్సీబీ అధికారులు మరోసారి ప్రశ్నించడం కలకలం రేపుతోంది. దీంతో ఆయను అరెస్ట్ చేసే అవకాశముందని నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గత నవంబర్‌లో అర్జున్ రాంపాల్‌ని ఎన్సీబీ అధికారులు ఒకసారి విచారించారు.

ARJUN RAMPAL

ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించి పలు డాక్యుమెంట్లతో పాటు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు విచారణ కోసం డిసెంబర్ 16న హాజరుకావాలని ఎన్సీబీ నోటీసులు జారీ చేసింది. కానీ వ్యక్తిగత కారణాల వల్ల అర్జున్ ఒక వారం సమయం తీసుకుని సోమవారం విచారణకు హాజరయ్యాడు. తన ఇంట్లో దొరికిన మెడిసిన్స్‌కి సంబంధించి డాక్టర్ ప్రిస్కిప్షన్‌ను అధికారులకు అందజేశారు.

అయితే ఆ ప్రిస్కిప్షన్ నకిలీదని తేలితే అర్జున్ రాంపాల్‌ను అరెస్ట్ చేసే అవకాశముంది. ఇటీవలే కరణ్ జోహార్‌కు ఎన్సీబీ అధికారులు నోటీసులు జారీ చేయగా.. 2017లో ఆయన నిర్వహించిన పార్టీ వివరాలను సమర్పించాలని కోరింది. దీంతో ఎన్సీబీకి కరణ్ జోహర్ ఆ వివరాలు అందించారు.