ప్రపంచం సుందరి ఐశ్వర్య రాయ్ కు కరోనా పాజిటివ్

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మరియు ఆయన కుమారుడు హీరో అభిషేక్ బచ్చన్ కు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం నిన్న నివేదికల ద్వారా వెల్లడైంది… అయితే ఈ రోజు అమితాబ్ కోడలు అభిషేక్ బచ్చన్ వైఫ్ మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్ కు కూడా కరోనా పాజిటివ్ అని పరీక్షల ద్వారా తెలిసింది. ఆమెతో పాటు ఆమె కుమార్తె ఆరాధ్య బచ్చన్ కు కూడా కోవిడ్ పాజిటివ్ అని తెలిసింది.

అమితాబ్ భార్య అయిన జయ బచ్చన్ కు మాత్రం కరోనా సొకలేదు అని హాస్పిటల్  సిబ్బంది తెలిపారు.

దీంతో ప్రభుత్వ అధికారులు అమితాబ్ ఇంటి పరిసర ప్రాంతాలను కంటోన్మెంట్ జోన్ గా ప్రకటించారు.

భారతదేశం మొత్తం వున్న బచ్చన్ ఫ్యామిలీ అభిమానులు మరియు సినీ ప్రముఖులు అమితాబ్ మరియు ఆయన కుటుంభసభ్యులు త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికల్లో విషెస్ పంపుతున్నారు…