Tollywood: మ‌రోసారి శ్యామ్‌కె నాయుడుపై ఫిర్యాదు చేసిన న‌టి శ్రీ‌సుధ‌!

Tollywood: ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ శ్యామ్ కె.నాయుడు పెళ్లి చేసుకుంటాన‌ని శారీర‌కంగా లొంగ‌దీసుకుని మోసం చేశాడ‌ని న‌టి శ్రీ సుధ పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా ఆమెను విజ‌య‌వాడ‌లోని క‌న‌క‌దుర్గ ఫ్లైఓవ‌ర్ పై ఎవ‌రో గుర్తు తెలియ‌ని దుండ‌గులు త‌న కారును గుద్దార‌ని.. ఈ విష‌యంలో త‌న‌కు Tollywoodశ్యామ్ కె. నాయుడుపై అనుమానం ఉంద‌ని విజ‌య‌వాడ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది శ్రీ‌సుధ‌.

srisudha issue

ఇదిలా ఉంచితే.. శ్యామ్ త‌న‌తో స‌హ‌జీవ‌నం చేసి పెళ్లికి నిరాక‌రించాడ‌ని హైద‌రాబాద్‌లోని ఎస్ ఆర్ న‌గ‌ర్ పోలీసుల‌కు Tollywoodశ్రీ సుధ గ‌తంలో ఫిర్యాదు చేసింది. అయితే ఎస్ ఆర్ న‌గ‌ర్‌లో పెట్టిన కేసు ద‌ర్యాప్తు కోసం సీఐ ముర‌ళీకృష్ణ త‌న ద‌గ్గ‌ర డ‌బ్బులు వ‌సూలు చేశార‌ని అప్ప‌ట్లో ఆమె ఆరోపించింది. అలాగే ఈ కేసులో నిందితుడు త‌న‌తో రాజీ కుదుర్చుకున్న‌ట్లు న‌కిలీ డాక్యుమెంట్స్ సృష్టించార‌ని.. నాంప‌ల్లిలోని ఏసీబీ అధికారుల‌కు ఫిర్యాదు చేసింది. ఇప్పుడు మ‌రోసారి శ్యామ్‌కెనాయుడు పై అనుమానంతో కేసు పెట్టింది.