Tollywood: అస‌లైన జాతిర‌త్నాలు వీళ్లే అంటున్న‌ ఆర్ఆర్ఆర్ టీం!

Tollywood: న‌వీన్ పోలీశెట్టి, రాహుల్ రామ‌కృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన చిత్రం జాతిర‌త్నాలు. ఈ చిత్రం నిన్న మ‌హాశివ‌రాత్రి కానుక‌గా విడుద‌లై పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించింది. ఈ చిత్రానికి అనుదీప్ ద‌ర్వ‌క‌త్వంలో.. స్వ‌ప్నా సినిమాస్ బ్యాన‌ర్‌పై డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ చిత్రం మంచి విజ‌యం సాధించ‌డంతో ప‌లువురు సినీ ప్రముఖులు నుంచి ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి.

jaathirathnalu movie

ఇదివ‌ర‌కే స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ నిన్న రాత్రి చూసి జాతిర‌త్నాలు టీంపై ప్ర‌శంస‌లు కురిపించిన విష‌యం తెలిసిందే. తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం వెరైటీగా విషెస్ తెలిపింది. జాతిర‌త్నాల్లో న‌వీన్ పోలీశెట్టి, రాహుల్ రామ‌కృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి ఒక చిల్ల‌ర గ్యాంగ్ వ‌చ్చిన వారి పోస్ట‌ర్లు చాలా వ‌ర‌కు ట్రెండ్ అయ్యాయి. అందులో Tollywood ఒక పోస్ట‌ర్‌ను రాజ‌మౌళి, తార‌క్‌, చ‌ర‌ణ్ ల‌తో మార్ఫ్ చేసి జాతిర‌త్నాలు టీమ్‌కు చిన్న స‌ర్‌ప్రైజ్ అంటూ ఆర్ఆర్ఆర్ టీం అధికారిక పేజీలో షేర్ చేసి బెస్ట్ విషెస్ తెలిపారు. ‌‌ ‌