అసలు స్టోరీని బయటపెట్టిన అడవి శేష్

ప్రస్తుతం 26/11 ముంబై అటాక్స్‌లో వీరమరణం పొందిన మేజర్ సుందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా వస్తున్న మేజర్ మూవీలో అడవి శేష్ నటిస్తున్నాడు. పాన్ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన వివరాలను తాజాగా అడవి శేష్ బయటపెట్టాడు. 26/11 ముంబై అటాక్స్ జరిగినప్పుడు తాను సాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నానని, అప్పుడు న్యూస్‌లో సందీప్ ఫొటో చూశానన్నాడు. ఆయనను చూడగానే మా ఇంట్లో నా అన్నయ్యలా అనిపించాడని, ఆయన కళ్లలో ఒక స్పిరిట్ ఉందన్నాడు. ఆయనపై వచ్చిన ప్రతి న్యూస్‌ను కట్ చేసి పెట్టుకున్నానని, ఇంటర్వ్యూస్ కంప్యూటర్‌లో సేవ్ చేసుకుని చూసుకునే వాడినని అడవి వేష్ తెలిపాడు.

adavi seshu

మేజర్ లాంటి పాన్ ఇండియన్ స్టోరీ నేను చెప్పగలనని నాకు నమ్మకం వచ్చినప్పుడు ఆయన పేరెంట్స్‌ను కంటాక్ట్ చేశానని, పదేళ్లుగా నా కొడుకు లైఫ్‌ను రీసెర్చ్ చేస్తున్నారా అని వారు నమ్మలేదని అడవి శేష్ చెప్పాడు. వారి పేరెంట్స్‌తో మాట్లాడిన నాలుగైదు రోజుల తర్వాత నువ్వు నా కొడుకు స్టోరీతో సినిమా చేయగలవని 10 శాతం నమ్ముతున్నాం అన్నారు. అప్పుడు ఈ సినిమా కచ్చితంగా చేయాలని మొండిపట్టు పట్టాను. మేజర్ సందీప్ గారి ఐకానిక్ ఫోటో కోసం నువ్వు ఆపుకుంటూ పాస్ పోర్ట్ ఫొటో దిగారట. కళ్ళలో ఉన్న స్పిరిట్ ఇన్నేళ్ళుగా ట్రావెల్ అయ్యేలా చేసింది. సందీప్ అమ్మగారు నన్ను చూసి సందీప్ లా ఉన్నావు అన్నారు. అని అడవి శేష్ చెప్పాడు.

సందీప్ పేరెంట్స్ నుంచి అంగీకారం వచ్చిన తర్వాత గ్రాండ్ గా ఈ సినిమా తీయాలని నిర్మించుకున్నాను. మహేష్ బాబు గారు మరియు సోని పిక్చర్స్ సహకారంతో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయాలనుకున్నాం” అని అడవి శేష్ చెప్పుకొచ్చాడు