నాగబాబు ట్వీట్ ఎవరిని ఉద్దేశించి?

మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆయన తన భావజాలాలు X ద్వారా తెలుపుతూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు సర్ విలియం గారు అనే UKకి సంబంధించిన ఓ వ్యక్తి చెప్పిన ఓ విషయాన్ని ఆయన తన Xలో పోస్ట్ చేశారు. “No person can be considered guilty of a crime until he or she has been found guilty of that crime by a court of law :- Sir William Garrow”. అయితే ఇది ప్రస్తుతం జరుగుతున్న జానీ మాస్టర్ వ్యవహారం గురించి లేదా దేని గురించి అనే విషయంపై ఆయన క్లారిటీ ఇవ్వలేదు. దానితో ఈ పోస్టు కచ్చితంగా జానీ మాస్టర్ కు సంబంధించి నాగబాబు గారు ట్వీట్ చేశారంటూ నిటిజన్లు అంటున్నారు.