ప్రభాస్ నెక్స్ట్ సినిమా ఏది కాబోతుంది?

ప్రభాస్ ఇటీవలే కల్కి సినిమాతో ప్రపంచ స్థాయి హిట్ కొట్టారు. ప్రస్తుతం యూరోప్లో హాలిడే కి వెళ్ళిన ప్రభాస్ త్వరలోనే ఇండియాకు తిరిగిరానున్నారు. అయితే తిరిగి వచ్చిన వెంటనే మారుతి దర్శకత్వంలో రాబోతున్న రాజసాబ్ షూటింగ్ చేయబోతున్నారు ప్రభాస్. ఆ సినిమాను ఎంతో వేగవంతంగా పూర్తి చేయాలి అనుకుంటున్నారు. ఆ తర్వాత ప్రభాస్ యానిమల్ ఫేమ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజి సినిమాలు వరుసగా చేయనున్నట్లు తెలుస్తుంది. అయితే స్పిరిట్ సినిమా గురించి ఇప్పటికే సందీప్ రెడ్డి తన మాక్సిమం స్ట్రెంత్ ఉపయోగించి ఈ సినిమా తీయబోతున్నట్లు తెలిపారు. ప్రస్తుతానికి ఆ సినిమా పూర్తి స్క్రిప్టింగ్ పని పూర్తి కాకపోవడంతో ప్రభాస్ రాజాసాబ్ సినిమా పూర్తి చేసిన తర్వాత ఫౌజి సినిమా షూటింగ్ కు డేట్లు ఇచ్చినట్లు తెలుస్తుంది.

ఫౌజి సినిమాను ఈ సంవత్సరంలోనే అక్టోబర్ నుండి షూటింగ్ మొదలు పెడదామని అంచనాలలో హను రాఘవపూడి ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే 2025లో అటు స్పిరిట్ సినిమాను అలాగే ఇటు ఫౌజి సినిమాను ఒకేసారి షూటింగ్ పూర్తిచేయాలని ప్రభాస్ అనుకుంటున్నట్లు, అదే విధంగా ప్రభాస్ డేట్లు ఇచ్చినట్టు తెలుస్తుంది. ప్రభాస్ నటించనున్న ఈ భారీ బడ్జెట్ సినిమా ఫౌజిలో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ నటించబోతున్నట్లు సమాచారం. అలాగే ఈ సినిమా పిరియాడిక్ డ్రామాగా 1940ల కాలం నాటి బ్రిటిష్ బ్యాక్ డ్రాప్ తో రాబోతుంది. ఈ సినిమాలో ప్రభాస్ ఓ సైనికుడి పాత్ర చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఈ భారీ బడ్జెట్ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా విశాల్ చంద్రశేఖర్ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.