Tollywood: వైష్ణ‌వ్ తేజ్ మ‌రో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్‌..

Tollywood: మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్‌తేజ్‌ ఉప్పెన చిత్రంతో మంచి విజ‌యం అందుకున్నాడు‌. దీంతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఎంతో గుర్తింపు సంపాదించుకున్నాడు. అలాగే ప్రేక్ష‌కుల్లో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను సంపాదించుకున్నాడు వైష్ణ‌వ్‌. ఈ చిత్రం బాక్సాఫీస్‌వ‌ద్ద క‌లెక్ష‌న్ల సునామీ కురిపించ‌గా.. డెబ్యూ హీరోగా రికార్డు స‌రికొత్త రికార్డుల‌ను సృష్టించాడు వైష్ణ‌వ్ తేజ్‌. ఇక ఈ చిత్రం షూటింగ్ ద‌శ‌లోనే ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ క్రిష్ తెర‌కెక్కె చిత్రంలో అవ‌కాశం ద‌క్కించుకున్నాడు.

ఈ Tollywood సినిమాలో వైష్ణ‌వ్‌కు జోడీగా ర‌కుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. అలాగే ఈ చిత్రంతో పాటు మ‌రో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు వైష్ణ‌వ్‌.. బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ నిర్మించే చిత్రంలో వైష్ణ‌వ్‌తేజ్ న‌టించ‌నున్నార‌ని స‌మాచారం. ఇప్ప‌టికే అన్న‌పూర్ణ ఫిల్మ్ స్కూల్ నుంచి ఓ కొత్త డైరెక్ట‌ర్ తెర‌కెక్కించే చిత్రంలో వైష్ణ‌వ్‌తేజ్ నటిస్తున్నార‌ని వార్తాలు వెలువ‌డుతున్నాయి. ఈTollywood చిత్రాన్ని మ‌నం ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మించ‌నుంది.‌