వరద బాధితులకు వరుణ్ తేజ్ ఆర్థిక సాయం

గత వారం రోజులుగా కురుస్తున్న కొండపోత వర్షాల వల్ల ఇరు తెలుగు రాష్ట్రాల్లో నదీ ప్రవాహాలు పొంగి చుట్టుపక్క ప్రాంతాల్లోకి వరదలుగా రావడం చూస్తూనే ఉన్నాం. హృదయాన్నే కదిలించే కొన్ని పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభసాయంత్ర ఇప్పటికే ఎన్నో సహాయక చర్యలు చేపట్టినప్పటికీ పరిస్థితులు ఇప్పటికీ పూర్తిగా సర్దుకోలేదు. ఇది ఇలా ఉండగా తెలుగు చిత్ర పరిశ్రమ నుండి నటీనటులు అలాగే మరి కొంతమంది ఇతర సినీ విభాగాలకు చెందిన వారు తమ వంతు సహాయంగా రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళాలు అందజేస్తున్నారు. అలాగే ఈరోజు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 15 లక్షల రూపాయలు విరాళం ఇస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. ఇరుతలకు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కు 5 లక్షల చొప్పున, అలాగే పవన్ కళ్యాణ్ గారిని అనుచరిస్తూ ఆంధ్ర ప్రదేశ్ పంచాయతీరాజ్ వ్యవస్థకు 5 లక్షల రూపాయలు విరాళం ప్రకటించడం జరిగింది.