ఆహా ఓటిటిలో దూసుకెళ్తున్న వరుణ్ సందేశ్ సినిమా ‘విరాజి’

“విరాజి” సినిమాతో ఒక మంచి ప్రయత్నం చేసి ప్రేక్షకుల ప్రశంసలు దక్కించుకున్నారు హీరో వరుణ్ సందేశ్. ఈ చిత్రాన్ని మహా మూవీస్ తో కలిసి ఎం3 మీడియా బ్యానర్ పై మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మించగా ఆద్యంత హర్ష దర్శకుడిగా ప్రతిభ చాటుకున్నారు. ఈ నెల 2న థియేటర్స్ లోకి వచ్చిన “విరాజి” సినిమా నేటి నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించారు.

నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల మాట్లాడుతూ – “విరాజి” సినిమాను ఈ నెల 2న థియేట్రికల్ రిలీజ్ చేశాం. ఆ వారం చాలా సినిమాలు ఉండటం వల్ల ఎక్కువమంది ఆడియెన్స్ కు మా మూవీ రీచ్ కాలేకపోయింది. అందుకే వీలైనంత త్వరగా ఓటీటీలోకి తీసుకురావాలని అనుకున్నాం. ఆహాలో మా సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే మా విరాజి చిత్రం 56 లక్షల వాచ్ మినిట్స్ తో ఆహా యాప్ లో ట్రెండింగ్ లో ఉంది. “విరాజి” సినిమా విషయంలో హీరో వరుణ్ సందేశ్ ఎంతో సపోర్ట్ చేశారు. ఏమాత్రం ఆటిట్యూడ్ లేని పర్సన్ మా హీరో. మంచి చిత్రం అందించిన మా దర్శకుడికి థాంక్స్” అని తెలిపారు

నటుడు వైవా రాఘవ మాట్లాడుతూ – “విరాజి” సినిమాను థియేటర్స్ లో ఆదరించిన ప్రేక్షకులకు థ్యాంక్స్ చెబుతున్నా. ఈ సినిమాలో నేను చేసిన రోల్ కు మంచి గుర్తింపు దక్కింది. ఆహాలో మా చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకి ధన్యవాదాలు” అన్నారు.

నటుడు కాకినాడ నాని మాట్లాడుతూ – “విరాజి” సినిమాలో మంచి క్యారెక్టర్ చేసే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ ఆద్యంత్ హర్ష, నిర్మాత మహేంద్ర నాథ్ గారికి థ్యాంక్స్. ఈ సినిమా కోసం వరుణ్ సందేశ్ గారు ఎంతో కష్టపడ్డారు. ప్రమోషన్స్ లో కూడా బాగా పార్టిసిపేట్ చేశారు. థియేటర్స్ లో చూడలేకపోయిన వారు ఆహా ఓటీటీలో మా “విరాజి” సినిమాను చూస్తున్నారు అని తన సంతోషాన్ని వ్యక్తం చేసారు.

హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ – ఈ రోజు “విరాజి” సినిమా ఆహా ఓటీటీలోకి వచ్చింది. 56 లక్షల వాచ్ మినిట్స్ తో ట్రేండింగ్ లో ఉంది. చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ రోజు మా ప్రొడ్యూసర్ మహేంద్రనాథ్ గారి పుట్టినరోజు. సో ఇది ఆయనకు బర్త్ డే గిఫ్ట్ అనుకుంటున్నా. మహేంద్రనాథ్ గారు మా మూవీని అభిరుచితో నిర్మించడమే కాకుండా బాగా ప్రమోట్ చేసి ఆడియెన్స్ దగ్గరకు తీసుకెళ్లారు. ఒక మంచి పాయింట్ తో డైరెక్టర్ ఆద్యంత్ హర్ష “విరాజి” సినిమాను అందరికీ నచ్చేలా రూపొందించారు. అయితే ఆగస్టు 2న థియేటర్స్ మేము అనుకున్నంత స్థాయిలో దొరకలేదు. థియేటర్స్ అందుబాటులో లేక చాలామంది చూడలేకపోయారు. ఇప్పుడు ఆహా ద్వారా అందరు చూస్తున్నారు” అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.

నటీనటులు – వరుణ్ సందేశ్, రఘు కారుమంచి, ప్రమోదిని, బలగం జయరామ్, వైవా రాఘవ, రవితేజ నన్నిమాల, కాకినాడ నాని, ఫణి ఆచార్య, అపర్ణదేవి, కుషాలిని పులప, ప్రసాద్ బెహరా, తదితరులు

టెక్నికల్ టీమ్

మేకప్ చీఫ్ – భానుప్రియ అడ్డగిరి
కాస్ట్యూమ్ డిజైనర్ – రోజా భాస్కర్
ఎడిటర్ – రామ్ తూము
సినిమాటోగ్రఫీ – జి.వి అజయ్ కుమార్
మ్యూజిక్ – ఎబినెజర్ పాల్ (ఎబీ)
వీఎఫ్ఎక్స్ – అఖిల్
ప్రాజెక్ట్ హెడ్ – సుకుమార్ కిన్నెర
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ – మల్లికార్జున్ కిన్నెర
పీఆర్ఓ – పవన్ పాల్
డిజిటల్ మార్కెటింగ్- ఎస్3 డిజిటల్ మీడియా
నిర్మాత – మహేంద్ర నాథ్ కూండ్ల
దర్శకత్వం – ఆద్యంత్ హర్ష