కట్టుదిట్టమైన భద్రతతో దగ్గుబాటి రానా పెళ్లి వేడుక

మారికొద్ది సేపట్లో రానా దగ్గుబాటి తన ప్రేయసి మిహీకా బజాజ్ మెడలో మూడు ముళ్ళు వేయబోతున్నాడు. ఈ వేడుకకు సురేష్ బాబు కట్టు దిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువవుతున్న సమయంలో ఏ మాత్రం రిస్క్ తీసుకోకుండా దగ్గుబాటి వారు అత్యంత జాగ్రత్తగా పెళ్లికి ప్రణాళికలు రచించారు.

ఇక మెయిన్ గా పీపీ కిట్లు ధరించి బౌన్సర్స్ మధ్యన ఈ పెళ్లి వేడుకను నిర్వహించనున్నారు. పెళ్లి వేడుకకు అక్కినేని ఫ్యామిలీ సభ్యులు కూడా పాల్గొంటున్నారు. రానా పెళ్లి సంబరాలు మొదలైనప్పుడే సమంత పెళ్లి పెద్దగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఎంగేజ్మెంట్, మెహంది వేడుకల నుంచి కూడా సమంత తన సందడితో రానా మ్యారేజ్ ని కలర్ఫుల్ గా మారుస్తోంది.

ఇక అక్కినేని నాగార్జున, అమల, అఖిల్, నాగ చైతన్య ఇలా వారి కుటుంబ సభ్యులు మొత్తం పెళ్లికి హాజరవుతున్నారు. ఇక దగ్గుబాటి వారి అత్యంత దగ్గరి బంధువులు అలాగే అతికొద్ది మంది సినీ సెలబ్రెటీస్ పెళ్లికి హాజరుకానున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరినీ కూడా శానిటైజ్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఏ మాత్రం ఆశ్రద్ద వహించకుండా ముందుగానే ప్రధమ చికిత్సకు అనుగుణంగా వైద్యానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది.