కల్కి టికెట్ రేట్ల పెంపు – ఈ రోజు సాయంత్రం నుండి అడ్వాన్స్ టికెట్స్ బుకింగ్?

ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా కల్కి 2898AD. నాగ అశ్విన్ దర్శకత్వలో వస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతి ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ ద్వారా అశ్విని దత్త్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించగా జోర్డ్జ్ స్టోజిల్జ్కోవిక్ సినెమాటోగ్రఫేర్గా చేస్తున్నారు. ఈ చిత్తంలో అమితాబ్ బచ్చన్, దీపికా పాడుకొనే, కమల్ హస్సన్, దిశా పాటని, బ్రహ్మానందం వంటి నటీనటులు ప్రముఖ పాత్రలలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే రోజు రోజుకు ఈ సినిమాలో నటించిన అగ్ర నటులు ఒకొకరిగా బయట పడుతూ ప్రేక్షకులను ఆశ్చర్పరుస్తాన్నారు. ఈ సినిమాలో దుల్కర్ సలీమాన్, విజయ్ దేవరకొండ తదితరులు కీలక పాత్రలలో కనిపించబోతున్నారు అనే వార్తలు మెండుగా వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా కల్కి మూవీ టీం విడుదల చేసిన రిలీజ్ ట్రైలర్ లో శోభన, మాళవిక నాయర్ కూడా కనిపించడం జరిగింది.

కల్కి సినిమాకు సుమారు 600 కోట్లు బడ్జెట్ పెట్టినట్లు సమాచారం. అయితే ఇప్పుడు ఉన్న టికెట్ రేట్లతో అంత బడ్జెట్ ను రాబట్టుకోవడం కష్టం అనే చెప్పుకోవాలి. కాబట్టి కల్కి సినిమా కలెక్షన్లు రావాలంటే కచ్చితంగా సినిమా టికెట్ రేట్లు పెంచాల్సింది. ఇది ఇలా ఉండగా కల్కి సినిమా నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ తెలంగాణ ప్రభుతాన్ని కోరగా తెలంగాణ ప్రాహుత్వం కల్కి సినిమా టికెట్ రేట్ల పెంపుకు అనుమతించింది. అలాగే ఈ సినిమాకుగాను బెనిఫిట్ షో లు కూడా వేసుకోవచ్చు అని అనుమతించింది. అయితే సినిమా విడుదల రోజు ఉదయం 5:30 కు మొదటి బెనిఫిట్ షో మొదలు కానుంది. అంతే కాకుండా బెనిఫిట్ షో సింగల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ 377/- అలాగే మల్టీప్లెక్స్లలో 495/- వరుకు టికెట్ రేట్లు పెంచారు. అలాగే రెగ్యులర్ షోలకు గాను సింగల్ స్క్రీన్ లలో 265/- అలాగే మల్టీప్లెక్స్లలో 413/- వరుకు పెంచడం జరిగింది.

కల్కి పాన్ ఇండియా సినిమాగా ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఎంత పాన్ ఇనియా సిఇనిమ అయినప్పటికీ ఇరు తెలుగు రాష్ట్రాలలో సినిమా లెక్కలు వేరుగా ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో టికెట్ రేట్లు పెంచినప్పటికీ ఇంకా ఆంధ్ర ప్రదేశ్ లో టికెట్ రేట్ల పెంపు గురించి ఏం చెప్పలేదు. గత 5 సంవత్సరాలలో ఆంధ్ర ప్రదేశ్ లో వైసిపి అధికారంలో ఉండగా సినిమా టికెట్ విషయంలో ఎన్నో రాజకీయాలు జరిగిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఇప్పటి ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీకి తోడుగా ఉంటుంది అని అందరు నమ్ముతున్నారు. సినిమా ఇండస్ట్రీ కి చెందిన నందమూరి బాల కృష గారు హిందూపు ఎంఎల్ఏ గా గెలవడం, అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కావడం తో ఇప్పటి ప్రభుతం ఇండస్ట్రీ కు సుప్పొర్ట్గా నిలుస్తుంది అనుకుంటున్నారు. కందుల దుర్గేష్ సినిమాటోగ్రఫీ మంత్రిగా ఎన్నికయిన సంగతి అందరికి తెలిసిందే. ఇక కల్కి సినిమా టికెట్ రేట్లు ఆంధ్ర ప్రదేశ్ లో ఎలా ఉండబోతున్నాయో వేచి చూడాల్సిందే.

ఈ రోజు సాయంత్రం 6 గంటల నుండి కల్కి అడ్వాన్స్ టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు అనే మాటలు కూడా ఇండస్ర్టీలో వినిపిస్తున్నాయి.