తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు లబ్ధి చేకూర్చేందుకు రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులలో రాష్ట్రంలోని అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో 10 శాతం రిజర్వేషన్లు అందుబాటులోకి రానున్నాయి.
![telangana government ews reservations](https://telugu.tfpc.in/wp-content/uploads/2021/02/telangana-governemnt-ews-reservations.jpg)
త్వరలో విడుదల అయ్యే ఉద్యోగాల భర్తీలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేస్తామని తెలిపింది. తెలంగాణలో ఇప్పటికే బలహీన వర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. ఇప్పుడు ప్రకటించిన 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వాటికి అదనంగా కానున్నాయి.