డ్రగ్స్ కేసులో హీరోయిన్‌కి షాకిచ్చిన కోర్టు

డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన శాండిల్‌వుడ్ హీరోయిన్ రాగిణి ద్వివేదికి సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. బెయిల్ మంజూరు చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. బెయిల్ ఇవ్వాల్సిందిగా కర్ణాటక హైకోర్టును తొలుత రాగిణి ద్వివేది ఆశ్రయించింది. కానీ కర్ణాటక హైకోర్టు ఆమె బెయిల్ పిటిషన్‌ను కొట్టిపారేసింది. దీంతో రాగిణి ద్వివేది సుప్రీంకోర్టును ఆశ్రయించింది. చివరికి సుప్రీంకోర్టు కూడా బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించడంతో ఆమె ఆశలు అడియాలయ్యాయి.

RAGINI DWIVEDI BAIL CANCEL

ఈ కేసులో మరో హీరోయిన్ సంజనా గల్రానీ బెయిల్ కోసం కర్ణాటక హైకోర్టును ఆశ్రయించగా.. ఆమెకు బెయిల్ లభించింది. అనారోగ్య కారణాల వల్ల ఆమెకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కానీ రాగిణికి బెయిల్ మంజూరు చేయకపోవడంతో.. ఇంకా జైలులోనే ఉంది.