ఆహా లో స్ట్రీమ్ అవుతున్న సందీప్‌ కిషన్‌ ‘ప్రాజెక్ట్ Z’

సందీప్‌ కిషన్‌ బ్లాక్ బస్టర్ మూవీ ‘ప్రాజెక్ట్ z’ ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. లావణ్య త్రిపాటి, జాకీష్రాఫ్‌ ప్రధాన పాత్రల్లో సి.వి. కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎస్‌బికె ఫిలింస్‌ కార్పోరేషన్‌లో ఎస్‌.కె. బషీద్‌ నిర్మించారు.

టాప్ టెక్నికల్ వాల్యూస్ తో రూపొందిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీ ఆడియన్స్ ని విశేషంగా అలరిస్తోంది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతూ ప్రస్తుతం టాప్ ట్రెండింగ్ కొనసాగుతోంది ప్రాజెక్ట్ z.

ఆద్యంతం ఆసక్తి కలిగించే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఉత్కంఠతతో తెరకెక్కిన ఈ సినిమాలో సందీప్‌కిషన్‌, లావణ్య త్రిపాటి, జాకీష్రాప్‌లు నటన, యూనిక్ కథ, కథనం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.