కాలేజీ విద్యార్థి కి ఎంబిబిఎస్ చదువు కోసం సహాయం చేసిన సితార ఘట్టమనేని

నేడు సూపర్ స్టార్ మహేష్ బాబు గారి తనయి సితార ఘట్టమనేని పుట్టినరోజు. కాకినాడలో ఉండే నవ్యశ్రీ అనే యువతి నీట్ ఎగ్జామ్ లో 457 వ ర్యాంక్ సాధించింది. ఎంబిబిఎస్ చేయాలన్న కోరిక ఉన్న తన కుటుంబ పరిస్థితుల రీత్యా చేయలేని పరిస్థితి. ఈరోజు సితార ఘట్టమనేని పుట్టినరోజు సందర్భంగా నవ్య శ్రీ కి చదువు కోసం మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా లక్ష 25 వేల రూపాయలు, లాప్టాప్, అప్రాన్ మరియు స్టెతస్కోప్ ఇచ్చి సహాయం చేశారు. అదేవిధంగా మహేష్ బాబు గారు తన ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదివిస్తానని మాట కూడా ఇచ్చారు. మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఎంతోమందికి సహాయం అందుతున్న విషయం మనందరికీ తెలిసిందే. నేడు సితార కూడా తన తండ్రి బాటలో చారిటీ ద్వారా సాధ్యమైనంత వరకు సహాయం కోరి వచ్చిన వారికి తన వంతు సహాయం అందిస్తానని చెప్పారు.