గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మూడు మొక్కలు నాటిన వర్థమాన సినీ నటుడు రూపేష్ కుమార్ చౌద‌రి

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా వర్థమాన సినీ నటుడు , ’22’ సినిమా హీరో రూపేశ్ కుమార్ జగద్గిరి గుట్ట లోని తన గార్డెన్స్ లో మూడు మొక్కలు నాటారు. తన పుట్టినరోజు సందర్భంగా తాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపకర్త జోగినపల్లి సంతోష్ కుమార్ ఇచ్చిన స్ఫూర్తితో తాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నా ననీ , దీనికి గాను సంతోష్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
పర్యావరణ ప్రేమికులు , ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించాలని కోరారు .