రియా చక్రవర్తి వాట్సాప్ ‘డ్రగ్ చాట్’.. బయటపడిన మరో షాకింగ్ సీక్రెట్

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ యొక్క విషాదకరమైన మరణం తరువాత అనేక రకాల సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఘటన వెనుక కుట్ర ఉండడమే కాకుండా డ్రగ్స్ కూడా ఉన్నట్లు నేషనల్ మీడియాలలో కొన్ని వార్తలు వస్తున్నాయి. ఒక విధంగా సుశాంత్ సూసైడ్ కి డ్రగ్స్ కూడా కారణమై ఉండవచ్చని అనుమానాలు వస్తున్నాయి. ఇటీవలే, టైమ్స్ నౌ లో వచ్చిన కథనాల ప్రకారం, రియా చక్రవర్తి మరియు ఆమె స్నేహితుల మధ్య డ్రగ్స్ వాడకం జరిగిందని వాటిని ఎలా ఉపయోగించాలి అనే విషయాల కోసం వారు సీక్రెట్ కోడ్స్ వాడినట్లు తెలుస్తోంది.

వారి వాట్సాప్ సందేశాలను యాక్సెస్ చేయగా MDMA, MD, Hash వంటి పదాలు ఉపయోగించారని తెలుస్తోంది. ‘అతను’ నీరు, కాఫీ లేదా టీలో కొన్ని చుక్కల డ్రగ్స్ తీసుకొని ఉండవచ్చని ఒక మెస్సేజ్ ని గుర్తించగా అతను అంటే సుశాంత్ అయ్యి ఉండవచ్చని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వార్త మీడియాలో వెలువడిన తరువాత, అతని సోదరి శ్వేతా సింగ్ కీర్తి దీనిని ‘క్రిమినల్ నేరం’ అని పిలిచి, వెంటనే చర్యలు తీసుకోవాలని సిబిఐని కోరింది. రియా, రాజ్‌పుత్ ఇద్దరు కూడా మాదకద్రవ్యాలను వినియోగించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నందున, రియా చక్రవర్తి న్యాయవాది సతీష్ దీనిని తీవ్రంగా ఖండించారు, ఆమె ఎప్పుడూ కూడా డ్రగ్స్ తీసుకోలేదని చెప్పారు.