డిసెంబర్ 18న థియేటర్స్ లో అర్జీవి కుటుంబ కథా చిత్రం ‘మర్డర్’!!

అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టీస్ ఎంటర్ టైన్‌మెంట్ పతాకంపై ఆనంద్ చంద్ర దర్శకత్వంలో నట్టి కరుణ,నట్టి క్రాంతి నిర్మిస్తున్న కుటుంబ కథా చిత్రం ‘మర్డర్’..డిసెంబర్ 18 న థియేటర్స్ లలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ ‘‘కుటుంబ కథా చిత్రం మర్డర్ సెన్సార్ సభ్యుల నుండి యు/ఏ సట్టిఫికెట్ పొందింది. ఈనెల 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కాబోతోంది’’ అని తెలిపారు.

నిర్మాతలు నట్టి కరుణ, నట్టి క్రాంతి మాట్లాడుతూ ‘‘న్యాయం గెలుస్తుందని మేము మొదటినుండి చెబుతూ ఉన్నాం. మర్డర్ సినిమా విడుదల అవ్వకుండా అనేక ఇబ్బందులు పెట్టారు. చివరికి మాకు న్యాయం జరిగింది. డిసెంబర్ 18న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సినిమా ఎవ్వరినీ ఉద్దేశించి తీసినది కాదు. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించే విధంగా ఈ మూవీ ఉంటుంది’’ అని తెలిపారు