లాక్ డౌన్ తరువాత రిలీజ్ కాబోయే మొదటి సినిమా ఇదే

సీనియర్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎలాంటి సినిమా చేసినా కూడా హాట్ టాపిక్ గా నిలవాల్సిందే. సినిమా మొదలు పెట్టకముందే ఎదో ఒక కాంట్రవర్సీతో హైప్ క్రియేట్ చేయడం ఆయనకు వోడ్కాతో పెట్టిన విద్య. ఇక ఫైనల్ గా లాక్ డౌన్ తరువాత మొదటగా తన సినిమానే రిలీజ్ కావాలని టార్గెట్ పెట్టుకున్నాడు.

కరోనా వైరస్ కారణంగా గత ఆరు నెలల నుంచి థియేటర్స్ మూత పడిన విషయం తెలిసిందే. ఫైనల్ గా అన్ లాక్ 5 సడలింపులతో ఈ నెల 15 నుంచి థియేటర్స్, మల్టీప్లెక్స్ లు ఓపెన్ కానున్నాయి. ఇక కరోనా వైరస్ అనే సినిమాను రూపొందించిన వర్మ లాక్ డౌన్ తరువాత ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయాలని చూస్తున్నాడు. లాక్ డౌన్ మొదలైనప్పుడే వర్మ ఈ సినిమాను సైలెంట్ గా పూర్తి చేశాడు. ట్రైలర్ కి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు సినిమా విడుదల తరువాత ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.