Tollywood: త‌ప్పు ఒప్పులులేవు కేవ‌లం అధికార‌మే.. ర‌మ్య‌కృష్ణ లుక్ అదుర్స్‌!

Tollywood: మెగా హీరో సాయితేజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో రిప‌బ్లిక్ చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి దేవ క‌ట్టా ద‌ర్శ‌క‌త్వంలో, జేబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, జీ స్టూడియోస్ బ్యాన‌ర్స్‌పై జె పుల్లారావు, జె.భ‌గ‌వాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఇందులో తేజ్‌కు జోడీగా ఐశ్వ‌ర్యా రాజేశ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. అలాగే విల‌క్ష‌ణ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు, ర‌మ్య‌కృష్ణ ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

ఇప్ప‌టికే విడుద‌ల అయినా ఫ‌స్ట్‌లుక్‌, గ్లింప్స్ సినిమా ఓ రేంజ్‌లో ఉండ‌బోతుంద‌ని చెప్పేశాయి. కాగా తాజాగా ర‌మ్య‌కృష్ణ‌కు సంబంధించిన పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో ఆమె విశాఖ వాణి పాత్ర‌ల్లో న‌టిస్తున్న‌ట్లు వెల్ల‌డిస్తూ చిత్ర‌బృందం ఈ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. ఆ పోస్ట‌ర్‌లో త‌ప్పూ..ఒప్పులు లేవు అధికారం మాత్ర‌మే శాశ్వ‌తం అంటూ రాసి ఉంది.