Powerstar: వీర‌మ‌ల్లు షూటింగ్‌లో అప‌శృతి.. ఆస్ప‌త్రిలో చేరిన ప్ర‌ముఖ న‌టుడు!

Powerstar: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. పీరియాడిక్ డ్రామాగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు క్రిష్ జాగ‌ర్ల‌మూడి ద‌ర్శ‌క‌త్వంలో.. ప్ర‌ముఖ నిర్మాత ఎఏమ్ ర‌త్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ చిత్రం షూటింగ్ ద‌శ‌లో ఉండ‌గా ఇటీవ‌లే షూటింగ్‌లో అప‌శృతి చోటు చేసుకుంది.

ఈ చిత్ర షూటింగ్‌లో భాగంగా ప్ర‌ముఖ న‌టుడు ఆదిత్య మీన‌న్ గుర్ర‌పు స్వారీ చేస్తున్న క్ర‌మంలో కింద‌ప‌డి గాయాల‌పాల‌య్యారు. దీంతో హుటాహుటి ఆయ‌న‌ను హైద‌రాబాద్‌లోని య‌శోద ఆస్ప‌త్రిలో చేర్పించారు చిత్ర‌బృందం. మెరుగైన వైద్యం కోసం చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిట‌ల్‌లో అడ్మిట్ అయ్యారు. ఇక ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యం బాగుంద‌ని చిత్ర‌బృందం వెల్ల‌డించింది.