నందమూరి ఇంట రాఖీ పండుగ

రాఖీ పండుగను నందమూరి కుటుంబసభ్యులు ఘనంగా జరుపుకొన్న వీడియా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ తన సోదరీమణులు లోకేశ్వరి, పురందేశ్వరి, భువనేశ్వరితో రాఖీ కట్టించుకున్నారు. ఈ సందర్భంగా పురందేశ్వరి.. బాలయ్యను ఆట పట్టించారు. పదేళ్ల వయసులో రాఖీ కడితే.. బాలయ్య కేవలం పది పైసలే ఇచ్చాడంటూ బాల్య స్మృతులను గుర్తు చేసుకున్నారు. బాలకృష్ణ దంపతులు.. సోదరీమణుల ఆశీర్వాదం తీసుకున్నారు. కాళ్లకి నమస్కారం సరిగా పెట్టు అంటూ పురందేశ్వరి మరోమారు బాలయ్యను సరదాగా ఆట పట్టించిన వీడియోను చూస్తూ నందమూరి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.