ప్రభుత్వానికి ప్రభాస్ భారీ విరాళం

ఇరు తెలుగు రాష్ట్రాలు భారీ వర్షాల వల్ల ఇబ్బంది పడుతున్న విషయం అందరికీ తెలిసిందే. నది ప్రవాహాలు పొంగి ఊరిలోకి వరద తాకిడి బాగా రావడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం వారు ఎంతో కష్టపడి సహాయక చర్యలు చేస్తున్నారు. అయితే సినిమా ఇండస్ట్రీ నుండి తమ వంతు సహాయంగా ఎంతోమంది నటీనటులు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు తమ వంతు సహాయంగా విరాళం ఇస్తూ వస్తున్నారు. అదేవిధంగా పాన్ ఇండియా స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ తన వంతు సాయంగా ఇరు తెలుగు రాష్ట్రాలకు కలిపి 2 కోట్ల రూపాయలు విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు.