Tollywood: రంగంలోకి దిగిన ప‌వ‌ర్‌స్టార్‌, సూప‌ర్‌స్టార్..

Tollywood: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వ‌కీల్‌సాబ్ చిత్ర షూటింగ్‌ ముగించుకుని త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్‌ను ప‌ట్టాలెక్కించారు. ఈ మేర‌కు ప‌వ‌న్ త‌న కొత్త సినిమా షూటింగ్ సోమ‌వారం ఉద‌యం ప్రారంభ‌మైంది. హైద‌రాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో ప‌లు స‌న్నివేశాల‌ను ప‌వ‌న్‌పై తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా మ‌ళ‌యాలంలో బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రం అయ్య‌ప్పనుమ్ కోషియంకు ఇది రీమేక్‌గా వ‌స్తుండ‌గా.. ఇందులో ప‌వ‌న్‌తో పాటు రానా కూడా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నాడు.

power super

Tollywood ఈ చిత్రానికి సాగ‌ర్ కె. చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ఈ సినిమాకు స్ర్కీన్‌ప్లే, మాట‌లు అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తుండ‌గా.. మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌. థ‌మ‌న్ ఈ చిత్రానికి స్వ‌రాలు స‌మ‌కురుస్తున్నారు. ఇక సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు గ‌తేడాది స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంతో భారీ హిట్ కొట్టాడు. ఆ త‌ర్వాత Tollywood గీత గోవిందం ఫేం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న స‌ర్కార్ వారి పాట చిత్రంలో మ‌హేశ్ న‌టిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ నేడు దుబాయ్‌లో ప్రారంభ‌మైంది. ఈ చిత్ర షూట్ ప్రారంభ‌మైన విష‌యాన్ని తెలియ‌జేస్తూ.. Tollywood మ‌హేశ్‌బాబు త‌న ట్విట్ట‌ర్ ద్వారా అభిమానుల‌తో పంచుకున్నారు. ఇక ఈ చిత్రంలో మ‌హేశ్ స‌ర‌స‌న కీర్తి సురేశ్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. మైత్రి మూవీ మేక‌ర్స్‌, 14రీల్స్ ప్ల‌స్, జీఎంబీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.