తిరుపతిలో ఎన్టీఆర్, బాలకృష్ణ అభిమానుల సంబరాలు

ఇప్పటికే టిడిపి 125 పైగా నియోజకవర్గాలలో ఆదిక్యం ఉండడంతో టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.తిరుపతి టీడీపీ పార్టీ కార్యాలయం వద్ద టీడీపీ నాయకులు ఘనంగా సంబరాలు చేసుకున్నారు.నరసింహ యాదవ్,పనబాక లక్ష్మి శ్రీధర్ వర్మ ఆధ్వర్యంలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి కర్పూర హారతులు ఇచ్చి గుమ్మడికాయ కొట్టారు.వర్షాన్ని సైతం లెక్కచేయకుండా సంబరాలు చేసుకున్నారు. టీడీపీ కార్యకర్తలు ఇంకా బాల కృష్ణ అభిమానులు అయిన అయ్యప్ప, వెంకట్ కృష్ణ, పెంచలయ్య, హేమంత్, ప్రసాద్ రాజు తదితరులు ఈ సంబరాలు చేసుకుంటుంన్నారు.