అక్కతో రాఖీ కట్టించుకున్న నితిన్.. స్పెషల్ ఫోటో వైరల్

టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా వారి సిస్టర్స్ తో కలిసి రక్షా బంధన్ వేడుకను చాలా ఆప్యాయంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. గతంలో ఎప్పుడు లేనంతగా చాలా మంది సినీ స్టార్స్ వారి ఫోటోలని షేర్ చేసుకుంటున్నారు. ఇక నితిన్ కూడా తన సోదరితో రాఖీ కట్టించుకున్న ఫోటో నెట్టిట్లో వైరల్ గా మారింది.

ఇటీవల నితిన్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఐదు రోజుల పాటు కొనసాగిన ఆ పెళ్లి వేడుకలో నితిన్ సోదరి నిఖితా రెడ్డి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. తన తమ్ముడు అంటే నిఖితకు చాలా ఇష్టం. ఇక ఇప్పుడు రాఖీ పండగ సందర్భంగా ఇద్దరు కూడా ఇలా స్పెషల్ మూమెంట్ తో సోషల్ మీడియాలో నెటిజన్స్ ని ఎట్రాక్ట్ చేశారు. ఇక నెక్స్ట్ నితిన్ రంగ్ దే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.