Nani: ఘ‌నంగా ట‌క్ జ‌గ‌దీశ్ ప‌రిచ‌య వేడుక‌..

Nani: న్యాచుర‌ల్ స్టార్ నాని ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కుతున్న ట‌క్ జ‌గ‌దీశ్ చిత్రం ఇటీవ‌లే ప‌రిచ‌య వేడుక కార్య‌క్ర‌మాన్ని రాజ‌మండ్రిలో ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ చిత్రం క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ట‌క్ జ‌గ‌దీష్ రాబోతుంది. షైన్ స్ర్కీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీశ్ పెద్ది నిర్మాణంలో.. శివ నిర్వాణ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇందులో నాని స‌ర‌స‌న రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేశ్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి ప్ర‌ముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ స్వ‌రాలు అందిస్తున్నారు.

ఇక రాజ‌మండ్రిలో జ‌రిగిన ప‌రిచ‌య వేడుక‌ల్లో హీరో నాని, చిత్ర డైరెక్ట‌ర్ శివ నిర్వాణ‌, హీరోయిన్లు రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేశ్‌లు పాల్గొన్నారు.. ఈ సంద‌ర్భంగా ఈ చిత్రానికి సంబంధించి ప‌లు విష‌యాలు షేర్ చేసుకుంటూ అభిమానుల‌కు ఈ సినిమాపై భారీ అంచ‌నాలు పెంచారు. ఫ్యామిలీ ఎమోష‌న్స్‌తో కూడిన‌ ఈ సినిమా అంద‌రికీ న‌చ్చుతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు డైరెక్ట‌ర్ శివ నిర్వాణ‌. ఇక ఈ చిత్రం ఏప్రిల్ 23న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.