Crime News: ప్రియుడి కోసం మ‌ద్యం మ‌త్తులో న‌గ్నంగా యువ‌తి హ‌ల్‌చ‌ల్!

Crime News: హైద‌రాబాద్‌లో ఓ ప్రియుడు త‌న‌ను మోసం చేశాడ‌ని మ‌ద్యం మ‌త్తులో న‌గ్నంగా ఓ యువ‌తి హంగామా చేసింది. వివ‌రాల్లోకి వెళితే.. బుధవారం అర్ధ‌రాత్రి న‌గ‌రంలోని ర‌హ్మ‌త్‌న‌గ‌ర్ పోలీస్ అవుట్‌పోస్టు స‌మీపంలోని పార్కు వ‌ద్ద న‌గ్నంగా చిందులేసింది. దీంతో అక్క‌డి స్థానికులు గ‌మ‌నించి వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం అందించారు. కాగా ఆ ప్రాంతానికి చేరుకున్న అవుట్‌పోస్టు మ‌హిళా పోలీసులు ఆమెకు దుస్తులు వేశారు. ఆ త‌ర్వాత కొద్దిసేప‌టికే వాటిని సైతం ఆ యువ‌తి చింపేసింది.

దీంతో పోలీసులు మ‌రోసారి ఆమెకు దుస్తులు అందించారు. అస‌లు విష‌యం ఏంటంటే.. పోలీసుల క‌థ‌నం ప్ర‌కారం.. కూక‌ట్‌ప‌ల్లికి చెందిన ప్రియుడు భ‌ర‌త్ త‌న‌ని పెళ్లి చేసుకుంటాన‌ని మోసం చేశాడ‌ని, Crime News: దీంతో ఆత్మ‌హ‌త్య చేసుకుంటానంటూ ఆ ప్రియుడికి ఫోన్ చేసింది. అయినా భ‌రత్ ద‌గ్గ‌రి నుంచి స్పంద‌న రాక‌పోవ‌డంతో.. అనంత‌రం ఇటువంటి చ‌ర్య‌కు పాల్ప‌డిన‌ట్లు పోలీసులు తెలిపారు. ఇక ఆ యువ‌తికి మ‌ద్యం మ‌త్తు దిగే వ‌ర‌కు పోలీస్‌స్టేష‌న్‌లోనే ఆశ్ర‌యం ఇచ్చి.. ఆ త‌ర్వాత యువ‌తిని కుటుంబ‌స‌భ్యుల‌కు అప్ప‌గించారు.