‘పుష్ప-2’ విషయంలో అలా జరగదు

ఐకాన్ సార్ అల్లు అర్జున్, నేషనల్ రష్మిక మందన హీరో హీరోయిన్గా నటిస్తూ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం పుష్ప-2. పుష్ప-1 కు సీక్వెల్గా ఈ చిత్రం డిసెంబర్ 6వ తేదీన రాబోతుంది. ఫాహద్ ఫాజిల్, సునీల్, అనసూయ, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలు నటిస్తూ ఈ చిత్రం మైత్రి మూవీస్ ద్వారా ప్రేక్షకులు ముందుకు రాబోతుంది.

ఇటీవలే మైత్రి మూవీ ద్వారా డిస్ట్రిబ్యూట్ అయిన మత్తు వదలరా 2 చిత్ర సక్సెస్ మీట్ లో మైత్రి రవి గారిని జర్నలిస్టులు ఇలా అడిగారు. పెద్ద సినిమాల ఈవెంట్స్ కు అభిమానుల క్రౌడ్ ఎక్కువగా ఉండటం తెలిసిన విషయమే. అదేవిధంగా ఇటీవలే దేవర సినిమాకు రిలీజ్ అయినందుకు అభిమానుల క్రౌడ్ ఎక్కువ కావడంతో ఆ ఈవెంట్ రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు డిసెంబర్ లో మీ సినిమా పుష్ప 2 రాబోతుంది. ఆ సినిమాకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు అని ప్రశ్నించగా రవి గారు ఎలా సమాధానం ఇచ్చారు. పుష్పటు సినిమాను వీలైనంతవరకు ఎక్కువ క్రౌడ్ పట్టే విధంగా చూసుకుంటాము. అభిమానులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈవెంట్స్ జరిగాలా జాగ్రత్తలు తీసుకుంటాము అని అన్నారు. అదేవిధంగా బయట జరుగుతున్న వేరే వేరే కాంట్రవర్సీలను పుష్ప 2 సినిమాకు అనవసరంగా ఆమోదపరచకండి. ఈ సినిమా ఎంతో కష్టపడి చేస్తున్నాము. ఈ సినిమాను తెలుగు సినిమా ఇండస్ట్రీ గర్వకారణంగా చూసుకోవాలి అని అన్నారు.