వాయనాడ్ కు కోటి రూపాయలు ప్రకటించిన మెగాస్టార్ చిరంజీవి

కేరళ రాష్ట్రంలోని వాయనాడ్ లో అధిక వర్షపాతం వల్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. దానివల్ల అటు ప్రభుత్వ ఆస్తులతో పాటు సామాన్య ప్రజల ఆస్తులు కూడా నష్టపోయారు. అంతేకాకుండా ఇప్పటికే ఎంతో ప్రాణ నష్టం జరిగినట్లు తెలుస్తుంది. అయితే భారతదేశ సైనికులు వాయనాడ్ చేరుకుని సహాయ చర్యలు చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా దేశవ్యాప్తంగా ఎందరో సినీ సెలబ్రిటీలు వాయనాడ్ ఆర్థిక సాయం చేకూర్చడం కోసం తమ వంతు విరాళాలు అందిస్తున్నారు. అదేవిధంగా పద్మ విభూషణ్ డాక్టర్ చిరంజీవి గారు అలాగే ఆయన కుమారుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కలిసి కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి రూపాయలు ఇస్తున్నట్లు మెగాస్టార్ చిరంజీవి గారు సోషల్ మీడియా అయినటువంటి తన X ద్వారా ప్రకటించారు. వాయనాడ్ కు అలా జరగడం తమకు ఎంతో బాధ కలిగిస్తుందని, అక్కడ ప్రజలంతా జాగ్రత్తగా ఉండేలా తన ప్రార్థిస్తున్నట్లు చిరంజీవి తెలిపారు.