తిరుమల తిరుపతి ఘటనపై స్పందించిన మెగా బ్రదర్ నాగబాబు

మెగా బ్రదర్, జనసేన పార్టీ కీలక నాయకుడు కొణిదల నాగబాబు దేశంలో సంచలనంగా మారిన తిరుమల తిరుపతి దేవస్థాన ప్రసాద లడ్డు సంఘటనపై స్పందించారు. ఈ విషయం పై స్పందిస్తూ నాగబాబు తన సోషల్ మీడియా వేదిక అయిన X ద్వారా ఇలా స్పందించారు.

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన “తిరుమల తిరుపతి దేవస్థానం” ప్రసాదాన్ని జంతు కొవ్వుతో,చేప నూనేతో కల్తీ చేసి కోట్లమంది హిందువుల మనోభావాలతో ఆడుకోవం క్షమించరాని నేరం.. ”పాపం చేసి కోట్లు కూడగట్టుకున్నాం అనుకున్నారు కాని కోట్ల మంది హిందువుల గోడు కూడగట్టుకున్నారు అని గుర్తించలేకపోయారు” ఒక వ్యక్తి ఒక మతాన్ని స్వీకరించి ఆ దేవున్ని నిష్టతో పూజించి ఆ దేవుడికి ప్రసాదం అర్పించడం జరుగుతుంది తదుపరి ఆ ప్రసాదాన్ని భుజిస్తే ఆ దేవుడే వారితో మమేకమైనట్టు నమ్ముతారు, అంతటి విశిష్టతమైన ప్రసాదాన్ని అందులోను తిరుమల వంటి ప్రపంచ ప్రఖ్యాత గల పుణ్యక్షేత్రం లోని లడ్డు ప్రసాదాన్ని నాలుగు రాళ్లు మిగుల్చుకోవాలనే దురుద్దేశంతో జంతు కొవ్వు సైతం వెయ్యడానికి వెనకాడని ఇలాంటి ద్రోహుల్ని క్షమించకూడదు,అందుకే తితిదే లాంటి శాఖలలో హిందుత్వాన్ని ఆచరించే వారుంటేనే ఇలాంటి అవాంఛనీయమైన సంఘటనలు పునరావృతం అవ్వవని నమ్ముతూ ఈ హేయమైన చర్యని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.