Maheshbabu: ఎడారిలో మ‌హేశ్‌బాబు.. ఎంతో అద్భుతం అంటూ ట్వీట్‌!

Maheshbabu: సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు న‌టిస్తున్న‌ తాజా చిత్రం స‌ర్కార్ వారి పాట‌. ఈ సినిమా ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుండ‌గా.. జీఎంబీ ప్రొడ‌క్ష‌న్స్‌, 14రీల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్ర షూటింగ్ కోసం ఇటీవ‌లే దుబాయ్‌కు చిత్ర‌బృందం వెళ్లిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే ఈ చిత్ర షూటింగ్‌లో భాగంగా.. Maheshbabu మ‌హేశ్‌బాబు నిన్న ఐన్‌5 దుబాయ్ బిల్డింగ్ షేర్ చేశారు..

mahesh

తాజాగా షార్జాలోని ఇసుక ఎడారుల దిబ్బ‌ల‌ను అభిమానుల‌తో పంచుకున్నాడు. షార్జా మెలిహా పురావ‌స్తు కేంద్రం ప‌రిస‌రాల్లో స‌ర్కార్ వారి పాట చిత్రీక‌ర‌ణ సాగుతుండ‌గా.. ఇక్క‌డ చిత్రీక‌ర‌ణ నిజంగా ఒక ప్ర‌త్యేక‌మైన అనుభ‌వం.. చారిత్ర‌క క‌థ‌ల‌తో ప్రాచుర్యం చెందిన స్థ‌ల‌మిది. అద్భుత‌మైన వినోద కార్య‌క‌లాపాలు అద్భుత‌మైన ప్ర‌కృతి దృశ్యాలు నా ఫేవ‌రెట్‌గా నిలుస్తాన్న‌యంటూ.. ఇక్క‌డివారి ఘ‌నమైన స్వాగ‌తం ఆతిథ్యాన్ని అభినందిస్తున్నాను అంటూ Maheshbabu మ‌హేశ్ ఓ అద్భుత‌మైన ఫోటోని షేర్ చేశారు. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన ఫోటో సోష‌ల్ మీడియాలో హల్‌చ‌ల్ చేస్తోంది. ఇక ఈ చిత్రంలో మ‌హేశ్ స‌ర‌స‌న తొలిసారి కీర్తి సురేశ్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్ ఈ సినిమాకు స్వ‌రాలు స‌మ‌కురుస్తున్నారు.