తమిళ్ దర్శకుడితో మహేష్ న్యూ ప్రాజెక్ట్?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విదంగా కరోనా కారణంగా మహేష్ లాంగ్ గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందు రావచ్చు లేదా.. 2022 సంక్రాంతికి అయినా రావచ్చు.

అయితే నెక్స్ట్ మహేష్ రాజమౌళితో కూడా ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ RRR ఫినిష్ కాలేదు కాబట్టి రాజమౌళికి ఇంకాస్త సనయం పట్టవచ్చు. దీంతో మహేష్ ఆ గ్యాప్ లో మరో తమిళ దర్శకుడితో సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కార్తీ ఖైదీ సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న లోకేష్ కనగరాజన్ నెక్స్ట్ విజయ్ మాస్టర్ సినిమాతో రాబోతున్నాడు. అయితే ఆ దర్శకుడు మైత్రి మూవీ మేకర్స్ తో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. ఇక అందులో మహేష్ బాబు హీరోగా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.