తిరుమల తిరుపతిలో మహేష్ బాబు కుటుంబం

తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్లే అలిపిరి నడకదారిలో మహేష్ బాబు కుటుంబం దర్శనం ఇచ్చారు. మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్, కుమారుడు గౌతమ్ తో పాటు కుమార్తె సితార అలిపిరి మెట్ల దారిలో కనిపించారు. తల్లి నమ్రత గారితో కలిసి పిల్లలు ఇద్దరు తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర కనిపించడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే దారిలో నమ్మలతో గారు కొబ్బరికాయ కొట్టి తమ నడక ముందుకు సాగడం జరిగింది. కాలినడకన కొండపైకి చేరుకున్న పిమ్మట ఆమె పిల్లలతో కలిసి వారి వాహనంలోకి వెళ్లడం జరిగింది.