ఈ నెల 30న విడుదల కాబోతున్న “నేను – కీర్తన” నుంచి లిరికల్ వీడియో విడుదల

చిమటా ప్రొడక్షన్స్ పతాకంపై చిమటా రమేష్ బాబు (“సి.హెచ్.ఆర్”)ను దర్శకుడిగా పరిచయం చేస్తూ… చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్) – రిషిత – మేఘన హీరోహీరోయిన్లుగా… చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఎ) సమర్పణలో చిమటా లక్ష్మికుమారి నిర్మించిన “నేను-కీర్తన” ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం నుంచి “మనసయ్యింది” లిరికల్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. అంచుల నాగేశ్వరరావు – సి.హెచ్.ఆర్ రాసిన ఈ గీతానికి హరి గుంట – లాస్యప్రియ గాత్రం అందించారు. ఎం. ఎల్.రాజా ఈ చిత్రానికి సంగీతం సారధి. ఈ గీతాన్ని “రమేష్ బాబు – మేఘన”లపై కులుమనాలిలో చిత్రీకరించారు!!

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కమ్ కథానాయకుడు రమేష్ బాబు మాట్లాడుతూ… నేను – కీర్తన” చిత్రానికి పాటలు ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి. మా టీమ్ అందరికీ మంచి పేరు తెస్తుందనే నమ్మకం నాకుంది. మల్టీ జోనర్ ఫిల్మ్ గా తెరకెక్కిన “నేను – కీర్తన” చిత్రాన్ని ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారని ఆశిస్తున్నాను” అన్నారు!!

రేణుప్రియ, సంధ్య, జీవా, విజయరంగ రాజు, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ సన్నీ, రాజ్ కుమార్, మంజునాథ్ ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ

డి.ఐ: భాను ప్రకాష్

వి.ఎఫ్.ఎక్స్: నవీన్

ఎస్.ఎఫ్.ఎక్స్: ఎ. నవీన్ రెడ్డి

పోరాటాలు: నూనె దేవరాజ్

నృత్యాలు: అమిత్ కుమార్ – సి.హెచ్.ఆర్

పాటలు: సి.హెచ్.ఆర్ – అంచుల నాగేశ్వరరావు – శ్రీరాములు

సంగీతం: ఎం.ఎల్.రాజా

ఛాయాగ్రహణం: కె. రమణ

కూర్పు: వినయ్ రెడ్డి బండారపు

సమర్పణ: చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఎ)

నిర్మాత: చిమటా లక్ష్మికుమారి

రచన – దర్శకత్వం: చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్.)