ఎల్వీ ప్రసాద్ స్టూడియో వివాదం.. పోలీసులను ఆశ్రయించిన ఇళయరాజా

మ్యూజిక్ డైరెక్టర్ మాస్ట్రో ఇళయరాజా ఎల్వి.ప్రసాద్ స్టూడియో వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఎల్వీ ప్రసాద్ మనవడు సాయి ప్రసాద్ తనను బెదిరిస్తున్నాడని ఇళయరాజా పోలీసులను ఆశ్రయించడం హాట్ టాపిక్ గా మారింది. గత నాలుగు దశాబ్దాలుగా ఇళయరాజా ఎల్వీ ప్రసాద్స్ స్టూడియోలో ఒక రూమ్ లో రికార్డింగ్ చేసుకుంటూ వస్తున్నారు.

ఇళయరాజాపై అభిమానంతో అప్పట్లో ఎల్వీ.ప్రసాద్ ఆయనకు గదిని కానుకగా అంధించారు. అదే గౌరవంతో ఎల్వీ.ప్రసాద్ కొడుకు కూడా ఇలాయరాజాను ఏమి అనలేదు. అయితే ఆయన మనవడు మాత్రం సీనియర్ సంగీత దర్శకుడిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. స్టూడియోను అక్రమర్శించుకోవాలని సాయి ప్రసాద్ బెదిరిస్తున్నట్లు ఇళయరాజా గత కొంత కాలంగా ఆరోపణలు చేస్తున్నారు. ఇక ఇప్పుడు మళ్ళీ ఆయన ఇదే విషయంలో పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది.