Laxmiprasanna: దివ్యాంగుల కోసం ల‌క్ష్మీప్ర‌స‌న్న 100కి.మీ సైక్లింగ్‌!

Laxmiprasanna: ప్ర‌ముఖ టాలీవుడ్ న‌టి ల‌క్ష్మీ ప్ర‌స‌న్న ఒక మంచి ప‌నికోసం 100కి.మీ సైక్లింగ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. సెల‌బ్రిటీలు సాధార‌ణంగా ఫిట్‌నెస్ కోసం సైక్లింగ్ చేస్తుంటారు. కానీ ఒక మంచి ప‌నికోసం మంచు ల‌క్ష్మీ సైక్లింగ్ చేస్తున్నారు. అస‌లు విష‌యం ఏంటంటే.. క్రీడల్లో రాణించాల‌నే కోరిక పేద దివ్యాంగుల‌ను ప్రోత్సాహిస్తూ, వారికి శిక్ష‌ణ ఇస్తోన్న ఆదిత్యా మెహ‌తా ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో దివ్యాంగుల కోసం ‌నిధుల సేక‌ర‌ణ‌లో భాగంగా 100కి.మీ ల సైకిల్ యాత్ర‌ను నిర్వహించారు.

ఈ నేప‌థ్యంలోనే ఈ సైక్లింగ్ యాత్ర‌కు ముందుకు వ‌చ్చారు Laxmiprasanna లక్ష్మీ ప్ర‌స‌న్న‌. దివ్యాంగుల కోసం నిధులు సేక‌రించ‌డానికి 100కి.మీ సైకిల్ తొక్కుతున్నారు మంచు ల‌క్ష్మీ. ఈ విష‌యాన్ని ఆమె ట్విట్ట‌ర్ ద్వారా తెలిపింది. ఇప్ప‌టికే 35కి.మీ సైక్లింగ్ పూర్తి అయ్యింద‌ని.. సైక్లింగ్ చేస్తున్న‌పుడు స్వ‌చ్ఛ‌మైన గాలి, వాస‌న, శ‌బ్దం న‌న్ను Laxmiprasanna ఆశ్చ‌ర్య‌ప‌రిచాయి.. నేను 100కి.మీ సైక్లింగ్ చేయ‌బోతున్నాను. ఆదిత్యా మెహ‌తా ఫౌండేష‌న్ కోసం నిధుల సేక‌ర‌ణ‌లో భాగంగా సైక్లింగ్ చేస్తున్న‌ట్ల చెప్పుకొచ్చింది ల‌క్ష్మీ. అలాగే మంచు ల‌క్ష్మీ సైక్లింగ్ ఈ నెల 28న ముగిస్తుంది. కాగా అప్ప‌టివ‌ర‌కు సైకిల్ తొక్కుతూ నిధులు సేక‌రిస్తారు.. ఆదిత్యా ఫౌండేష‌న్‌కు విరాళం ఇచ్చి పేద దివ్యాంగులు పారా గేమ్స్‌లో రాణించ‌డానికి స‌హక‌రించాల‌ని మంచు ల‌క్ష్మీ కోరుతున్నారు. దీంతో సోష‌ల్ మీడియాలో Laxmiprasanna ల‌క్ష్మీప్ర‌స‌న్న‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు నెటిజ‌న్స్‌.