నేషనల్ అవార్డు గెలుచుకున్న “కార్తికేయ 2”

చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్ల్గా నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సీజిత్రం కార్తికేయ 2. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, శ్రీనివాస్ రెడ్డి, హర్ష చెముడు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలలో నటించారు. 2014లో విడుదల అయినా కార్తికేయ సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా వచ్చింది. అభిషేక్ అగర్వాల్, టిజి విశ్వ ప్రసాద్ నిర్మాతలుగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థలు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. 2022లో ఆగష్టు 13న ఈ సినిమా విడుదల కాగా 2024 జాతీయ చలన చిత్ర అవార్డు రావడం జరిగింది. 70వ నేషనల్ ఫిలిం అవార్డు 2022 డిసెంబరు 1 నాటికి వచ్చిన సినిమాలలో వివిధ భాషలలో వచ్చిన సినిమాలకు నటీనటులు, సినిమాలో వివిధ సంకేతక నిపుణులకు ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు తెలుగులో బెస్ట్ సినిమాగా కార్తీకేయ 2 సినిమా నేషనల్ అవార్డు గెలుచుకున్నట్లు తెలిపారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయినా ఈ సినిమా దేశ నలుమూలల నుండి సుమారు 130 కోట్ల రూపాయల కలెక్షన్స్ తో మంచి విజయాన్ని సాధించింది.