బిగ్ బడ్జెట్ సినిమాను పక్కనెట్టి.. రొమాంటిక్ కథను లైన్ లో పెట్టిన కరణ్ జోహార్!

బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఏదో ఒక కొత్త పాయింట్ హైలెట్ గా ఉంటుంది. భవిష్యత్తులో కరణ్ కొన్ని బిగ్ బడ్జెట్ సినిమాలను రిలీజ్ చేయనున్నాడు. మెయిన్ గా ‘తక్త్’ ప్రాజెక్టును ఎనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా ఓ వర్గం ఆడియెన్స్ లో అంచనాలు భారీగానే పెరిగాయి. ఎందుకంటే అందులో బాలీవుడ్ స్టార్స్ నటించనున్నారు.

తక్త్ సినిమాలో రణ్ వీర్ సింగ్, కరీనా కపూర్, అలియా భట్, భూమి పడ్నేకర్, విక్కీ కౌషల్, జాన్వీ కపూర్, అనిల్ కపూర్ వంటి అగ్రతారలు నటిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ సినిమాను కరణ్ జోహార్ పక్కనపెట్టి మరో రొమాంటిక్ కథను సెట్స్ పైకి తెనున్నాడట. రణ్ వీర్ సింగ్, అలియా భట్ తో ఒక రొమాంటిక్ కథను తెరకెక్కించాలని కరణ్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. తక్త్ సినిమా బారి స్కెల్ తో రూపొందించాలి కాబట్టి కరోనా సమయంలో సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ వర్క్ చేయడం కుదరని పని అని ఇప్పుడు సేఫ్ జోన్ లో తక్కువ మంది యూనిట్ సభ్యులతో రొమాంటిక్ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. మరి ఆ సినిమా ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.