తుస్సాడ్స్ మ్యూజియమ్స్లో ప్రముఖ సినీ తారల విగ్రహాలు ఆవిష్కృతం కావడం కొత్త ఏం కాదు. ఆల్రెడీ దివంగత నటి శ్రీదేవి, అమితాబ్బచ్చన్, షారుక్ఖాన్, సల్మాన్ఖాన్, హృతిక్ రోషన్, షాహిద్కపూర్, ప్రియాంకా చోప్రా, దిల్జీత్ సింగ్ ఇలా మంది బాలీవుడ్ తారల మైనపు విగ్రహాలు తుస్సాడ్స్ మ్యూజియమ్స్లో కొలువుతీరాయి. ఇక సౌత్ విషయానికి వస్తే ముందు తొలుత ఈ ఘనతను సాధించింది. ప్రభాస్. ఆ తర్వాత మహేశ్బాబు మైనపు విగ్రహాన్ని సింగపూర్లోని మేడమ్తుస్సాడ్స్లో నెలకొల్పారు. ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే ఈ ఫీట్ను సాధించింది ఒక్క కాజల్ అగర్వాల్ మాత్రమే. గత ఏడాది డిసెంబరులో ఈ కలువకళ్ల సుందరి కొలతలు తీసుకున్నారు సింగపూర్కు చెందిన మేడమ్తుస్సాడ్స్ ప్రతనిధులు. ఈ బుధవారం ఆ మైనపు విగ్రహాం ఎలా ఉంటుందో బయటకు తెలియగానే బొమ్మ అదిరింది బాసూ అంటూ కాజల్ అభిమానులు మస్త్ ఖుషీ అవుతున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే….కమల్హాసన్ `భారతీయుడు 2`, మంచు విష్ణు `మొసగాళ్లు` చిత్రాలతోపాటు హిందీలో `ముంబైసాగ` అనే చిత్రంలో నటిస్తున్నారు కాజల్. అలాగే బాలీవుడ్ హిట్ `క్వీన్` తమిళ రీమేక్ `ప్యారిస్ ప్యారిస్`లో కాజల్ నటించారు. ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది.