వాయనాడ్ కు 25 లక్షలు విరాళం ప్రకటించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

కేరళలో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికి తెలిసిందే. అధిక వర్షాల వల్ల వరదలు వస్తూ వాయనాడ్ లో కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. ఇప్పటికే దానివల్ల ఎంతో ఆస్తి నష్టం అలాగే ప్రాణ నష్టం జరిగింది. ఇప్పటికే భారతదేశ సైనికులు అక్కడ ఎన్నో సహాయ చర్యలు చేపట్టి ప్రజలను కాపాడుతూ వస్తున్నారు. ఇది ఇలా ఉండగా దేశవ్యాప్తంగా ఎందరో సినీ సెలబ్రిటీలు తమ వంతు సహాయంగా కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు ఆర్థిక సాయం చేస్తున్నారు. కార్యక్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన వంతు స్వయంగా 25 లక్షల రూపాయలు విరాళంగా ఇస్తున్నారు. తనకు ఎంతో ప్రేమను ఇచ్చిన తన అభిమానులు కేరళలో ఉన్నారు. అలాగే కేరళ ప్రజల భద్రత ఇంకా బలం కోసం దేవుడిని ప్రార్థిస్తున్నట్లు అల్లు అర్జున్ తెలిపారు.