Kollywood: హీరో ఆర్య‌పై జ‌ర్మ‌నీ మ‌హిళ కేసు.. ఏకంగా రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధానికి లేఖ‌!

Kollywood: కోలీవుడ్ హీరో ఆర్య త‌మిళ్‌తో పాటు తెలుగు భాష‌ల్లో కూడా ప్రేక్ష‌కుల్లో గుర్తింపు ఉంది. ఆయ‌న న‌టించిన తొలి తెలుగు చిత్రం అల్లుఅర్జున్ హీరోగా తెర‌కెక్కిన వ‌రుడు చిత్రంలో విల‌న్‌గా న‌టించి టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఎంతో గుర్తింపు సంపాదించుకున్నాడు ఆర్య‌. త‌మిళ్‌లో ప‌లు చిత్రాల్లో న‌టించి అక్క‌డి ప్రేక్ష‌కుల‌ను కూడా ఎంతాగానో ఆక‌ట్టుకున్నాడు. హీరోయిన్ సాయేషా సైగ‌ల్‌ను ఆర్య పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. కాగా తాజాగా ఆర్య‌పై ఓ జ‌ర్మ‌నీ యువ‌తి ఏకంగా రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాన‌మంత్రి మోదీకి ఫిర్యాదు చేసింది.

arya hero

త‌న‌ను పెళ్లి చేసుకుంటాన‌ని Kollywoodఆర్య మోసం చేశాడ‌ని.. త‌న నుంచి తీసుకున్న రూ.80ల‌క్ష‌ల డ‌బ్బును తిరిగి ఇప్పించాల‌ని ఆమె త‌న ఫిర్యాదులో పేర్కొంది. చెన్నైలోని ఓ వైద్య సేవ‌ల సంస్థ‌లో ప‌నిచేస్తోంది ఆ జ‌ర్మ‌నీ యువతి. మ‌హ్మ‌ద్ అర్మాన్‌, హుస్సేనీ అనే వ్య‌క్తుల ద్వారా Kollywoodఆర్య పరిచ‌యం అయిన‌ట్టు ఆమె వెల్ల‌డించింది. అయితే లాక్‌డౌన్ స‌మ‌యంలో ఆర్య ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున త‌న‌కు రూ..80ల‌క్ష‌లు ఇచ్చాన‌ని.. త‌న త‌ల్లి జ‌మీలా స‌మ‌క్షంలోనే ఆ డ‌బ్బును అందించాన‌ని ఆ జ‌ర్మ‌నీ యువ‌తి స్ప‌ష్టం చేసింది. తిరిగి త‌న డ‌బ్బు ఇవ్వాల‌ని కోరితే ఆర్య‌, త‌న త‌ల్లి స‌రిగా స్పందించ‌లేద‌ని వాపోయింది. ఈ నేప‌థ్యంలోనే త‌న‌ను ఇష్ట‌ప‌డుతున్నాన‌ని.. పెళ్లి కూడా చేసుకుంటాన‌ని న‌మ్మించి మోసం చేశాడు ఆర్య అని ఆమె తెలిపింది. ఇలా కొంత‌మంది అమ్మాయిల‌ను కూడా మోసం చేశాడు అని ఆరోపించింది. Kollywoodఆర్య మోసానికి త‌న వ‌ద్ద అన్ని ఆధారాలు ఉన్నాయ‌ని.. ఈ విష‌యంలో క‌చ్చితంగా త‌న‌కు న్యాయం జ‌ర‌గాల‌నే ఉద్దేశ్యంతో నేరుగా భార‌త ప్ర‌ధానికి, రాష్ట్ర‌ప‌తికి లేఖ రాశానని ఆ లేఖ‌లో పేర్కొంది.